నిండుకుండల్లా జంట జలాశయాలు –

Date:


– పూర్తిస్థాయికి చేరిన హిమాయత్‌సాగర్‌ నీటిమట్టం
– 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నవతెలంగాణ-గండిపేట్‌
రంగారెడ్డి జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమాయత్‌సాగర్‌ చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో శనివారం అధికారులు ఆరు గేట్లను ఎత్తారు. నాలుగు రోజుల నుంచి ఎగువ ప్రాంతాలైన తాండూర్‌, పరిగి, వికారాబాద్‌, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌, శంషాబాద్‌ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్‌ నుంచి 1375 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్‌ నీటిమట్టం 1763 అడుగులు. గండిపేట్‌ 1790 అడుగుల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 1786కు చేరింది. గండిపేట పూర్తిస్థాయిలో చేరితే గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. రాజేంద్రనగర్‌ వైపు వెళ్లే ఔటర్‌ సర్వీసింగ్‌ రోడ్డును పూర్తిగా మూసేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...