5.1 C
New York
Tuesday, March 21, 2023
HomeLifestyleDevotionalఅంగ రంగ వైభవంగా శ్రీశైల బ్రహ్మోత్సవాలు

అంగ రంగ వైభవంగా శ్రీశైల బ్రహ్మోత్సవాలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

తెలుగు నేలపై కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే గిరిశృంగం మీద వెలసిన పరమ పవిత్ర స్థలంగా భాసిల్లుతున్న క్షేత్రం. పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండవ ది, శ్రీభ్రమరాంబాదేవికి నెలవైన శక్తిపీఠం. శైవక్షేత్రాల్లో తలమానికం. మల్లికార్జున మహాలింగ చక్రవర్తి కొలువై ఉండి, సకల లోకారాధ్యం గా, త్రైలోక్య పూజితంగా విరాజిల్లు తున్నది. సంకల్ప, పూజా సందర్భా లలో శ్రీశైలానికి ఏ దిగ్బాగంలో ఉన్నామో భగవంతునికి తెలియ చేసుకునే సాంప్రదాయాన్ని బట్టి క్షేత్ర ప్రాధాన్యత స్పష్టం అవుతున్నది.
పురాణాల్లో వర్ణితమైనఎనిమిది శృంగాలతో, నలభై నాలుగు నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలతో, చంద్ర, సూర్య కుండాది పుష్కరిణులతో, లతలు, వృక్ష సంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు కలిగి శ్రీశైల మల్లన్న దేవుని సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివం దనం చేస్తూ వేదఘోషను ప్రతిధ్వ నింప చేస్తూ, పాతాళగంగ నామాం కిత అయిన కృష్ణవేణీ నది ఈ ప్రదే శంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తు న్నది. అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసా ల్లోనూ శ్రీశైల వైభవం వర్ణించ బడింది. కృతయుగంలో హిరణ్య కశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకొన్నాడు. పురా ణాల ప్రకారం సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు భక్తితో స్థాపించిన సద్యోజాత లింగం, పంచపాండవ లింగాలు పూజార్హ త కలిగి అల రారు తున్నాయి. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్రాన్ని గురించిన వర్ణనలున్నాయి. పలు భాషల కవులు క్షేత్ర ప్రాధాన్యతను అభివర్ణించారు.

స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆది శంకరులు కొంత కాలం ఇక్కడ తపస్సు చేసి, శివానంద లహరిని రచించి, మల్లి కార్జునుడికి సమర్పించి, భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకొనే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరి స్తూ తన పాదుకల్ని పట్టుకొన్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురుచరిత్ర చెబుతోంది. నృసింహ సరస్వతి స్వామి ఇప్పటికీ కదళీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తాత్రేయ భక్తులు విశ్వసిస్తారు.

శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడి మఠాలలో ఉన్న సాధకులు, యోగు ల వసతి కోసం క్రీస్తుపూర్వం నుంచి అనేక రాజవంశాలు ఎన్నో దానాల ను గావించి నట్లు శిలాశాసనాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, కాకతీయు లు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, భ్రమరాంబికా సమేతులైన మల్లికార్జునుణ్ణి దర్శించి భక్తుల సౌకర్యాలకు ఎన్నో ఏర్పాట్లు, అశేష వస్తుసంపదలు సమర్పించారు.

శ్రీశైలంలో పంచ మఠాలు ప్రాచీన మైనవి. మొదటిదైన ఘంటామఠం – శ్రీశైల ఆలయానికి వాయువ్యదిశగా ఉంది. శివ సాధకుడైన ఘంటాకర్ణ సిద్దేశ్వరుడు తన శిష్యులతో కలిసి దీనిని ఏర్పాటు చేశారు. రెండోదైన విభూతి మఠం, శ్రీకృష్ణ దేవరాయల కాలపు వీరశైవుడైన శాంతి మల్లయ్య అనే వ్యక్తి పేరు మీదుగా ఏర్పడినట్లు పరిశోధనలు వివరిస్తున్నాయి. మూడోదైన రుద్రాక్ష మఠాన్ని మల్లి శంకరస్వామి అనే భక్తుడు నిర్మించాడని తెలుస్తోం ది. ఇక్కడికి వచ్చే భక్తులకు అతడు రుద్రాక్షలను పంచిపెడు తుండేవాడ ని స్థానికులు చెబుతుంటారు. నాలుగోదైన సారంగ మఠాన్ని సారంగేశ్వరముని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. దీనికి సంబంధించిన లిఖిత ఆధారంగా క్రీ.శ.1585 నాటి శాసనం మఠంలో లభ్యమైంది. అయిదోదైన నంది మఠంలో నందికేశ్వరుడు అనే యోగి సుదీర్ఘకాలం జీవించాడు. ఇది ఘంటా మఠానికి వైపు ఉండేది. ఇవే కాకుండా శ్రీశైలంలో పలు మఠాలు ఉండేవి. వాటిలో వీరశైవ సిద్ధాంత భిక్షావృత్తి మఠం ప్రసిద్ధమైంది. క్రీ.శ. 1518లో దీనిని సిద్ధ భిక్షావృత్తి భార్య, శిష్యుడు పర్వతయ్యలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి చాలాకాలం ముందే 3వ కుళోత్తుంగ చోళుడు ఒక మఠాన్ని క్రీ.శ. 1178-1216 మధ్య కాలంలో ఏర్పాటు చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. వటసిద్ధి మఠం, చంద్రమఠం, కమరీ మఠం అనే మఠాలు భక్తులకు అన్నవసతి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా అనేక మఠాలు పదహారో శతాబ్దికి పూర్వం నుంచే ఇక్కడ ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 11న సాయంత్రం మల్లన్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ జరుగనుంది. ఈ నెల 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు.
16న పుష్పపల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రభోత్సవం.. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ ఉండనుంది. అర్ధ రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 19న సాయంత్రం రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 20న పూర్ణాహుతి కార్యక్రమం.. రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ ఉండనుంది. ఈనెల 21న అశ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఈ ఉత్సవాల్లో స్వామి వారు వివిధ వాహనాలను అధిరోహించి, తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం కలిగిస్తారు. ప్రత్యేకించి మహాశివరాత్రి నాడు స్వామి వారికి ప్రభోత్సవం, నందివాహన సేవలతో పాటు అనేక విశేష కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవస్థానం ఈవో లవన్న ఆధ్వర్యంలో, భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments