ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ లీగ్ అయిన ఐపిఎల్ 2021 కు సంబంధించిన ఆక్షన్ ఈరోజు చెన్నైలో జరగనున్నది.ఈ ఆక్షన్ లో స్టీవ్ స్మిత్,మాక్స్ వెల్ ,క్రిస్ మోరిస్ వంటి ఫారిన్ ప్లేయర్స్ కేదార్ జాదవ్,శివం దూబే,అర్జున్ టెండూల్కర్ వంటి దేశీయ కీలక ప్లేయర్స్ ఉన్నారు.వీరిలో ఎవరిని ఏ ఫ్రాంచైజ్ కొంటుందో అని ఫ్యాన్స్ ఈగార్ గా వెయిట్ చేస్తున్నారు.మొత్తం ఈసారి 8 టీమ్స్ కు కలుపుకొని 61 ఖాళీ స్లాట్స్ ఉన్నాయి.ఇందులో 22 ఫారిన్ ప్లేయర్స్ స్లాట్స్ ఉన్నాయి.ఇక గత ఏడాది భారత్,చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపిఎల్ అఫిషియల్ స్పాన్సర్ గా తప్పుకున్న వివో, ఈ ఏడాది ఐపిఎల్ అఫిషియల్ స్పాన్సర్ గా చేరింది.
భారీ అంచనాలు నడమ మొదలైన ఐపిఎల్ 2021 ఆక్షన్ లో 14 కోట్ల 25 లక్షలకు మ్యాక్స్ వెల్ ను బెంగళూరు,.క్రిస్ మోరిస్ ను 16 కోట్ల 25 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇప్పటివరకు ఇవే ఈ ఏడాది ఐపిఎల్ లో బిగ్గెస్ట్ పర్చేసేస్ గా నిలిచాయి.