5.1 C
New York
Tuesday, March 21, 2023
HomeNewsప్లేయర్ కోసం గట్టిగా పోటీ పడిన బడా టీమ్స్....!

ప్లేయర్ కోసం గట్టిగా పోటీ పడిన బడా టీమ్స్….!

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ లీగ్ అయిన ఐపిఎల్ 2021 కు సంబంధించిన ఆక్షన్ ఈరోజు చెన్నైలో జరగనున్నది.ఈ ఆక్షన్ లో స్టీవ్ స్మిత్,మాక్స్ వెల్ ,క్రిస్ మోరిస్ వంటి ఫారిన్ ప్లేయర్స్ కేదార్ జాదవ్,శివం దూబే,అర్జున్ టెండూల్కర్ వంటి దేశీయ కీలక ప్లేయర్స్ ఉన్నారు.వీరిలో ఎవరిని ఏ ఫ్రాంచైజ్ కొంటుందో అని ఫ్యాన్స్ ఈగార్ గా వెయిట్ చేస్తున్నారు.మొత్తం ఈసారి 8 టీమ్స్ కు కలుపుకొని 61 ఖాళీ స్లాట్స్ ఉన్నాయి.ఇందులో 22 ఫారిన్ ప్లేయర్స్ స్లాట్స్ ఉన్నాయి.ఇక గత ఏడాది భారత్,చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపిఎల్ అఫిషియల్ స్పాన్సర్ గా తప్పుకున్న వివో, ఈ ఏడాది ఐపిఎల్ అఫిషియల్ స్పాన్సర్ గా చేరింది.

భారీ అంచనాలు నడమ మొదలైన ఐపిఎల్ 2021 ఆక్షన్ లో మొదట పూల్ క్యాప్ బ్యాట్స్ మెన్ ఆక్షన్ లోకి వచ్చారు.ఇందులో మొదటగా వచ్చిన కరుణ నాయర్, ఆతర్వాత వచ్చిన ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ అలెక్స్ హెల్స్, జేసన్ రాయ్ అన్ సోల్డ్ గా మిగిలారు.ఇక ఆతర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ ను 2 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నారు.

ఇక తర్వత ఆక్షన్ లోకి వచ్చిన మ్యాక్స్ వెల్ కోసం అటు చెన్నై,ఇటు బెంగళూరు గట్టిగా పోటీ పడ్డాయి.చివరికి మ్యాక్స్ వెల్ ను 14 కోట్ల 25 లక్షలకు బెంగళూరు సొంతం చేసుకుంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments