IND Vs WI : 500వ మ్యాచ్‌లో కోహ్లీ అరుదైన రికార్డు..

Date:





భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‍లో శతకంతో చెలరేగాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‍తో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేశాడు కింగ్ కోహ్లీ. దీంతో 500వ అంతర్జాతీయ మ్యాచ్‍లో శతకం సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సెంచరీ టెస్టుల్లో 29వ సెంచరీ కాగా, ఇంటర్ నేషనల్ క్రికెట్ లో ఓవర్ ఆల్ గా 76వ సెంచరీ కావడం విశేషం.

వెస్టిండీస్‍తో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇప్పటి వరకు 4 వికెట్లకు 317 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (182 బంతుల్లో 102 పరుగులు నాటౌట్), రవీంద్ర జడేజా (106 బంతుల్లో 50 పరుగులు నాటౌట్) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఇకపోతే టీమిండియా మొదటి టెస్టులోనూ ఘన విజయం సాధించింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...