5.1 C
New York
Tuesday, March 21, 2023
HomeLifestyleLife styleపిల్లలలో పఠనాసక్తిని పెంచాలి

పిల్లలలో పఠనాసక్తిని పెంచాలి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

డెన్మార్క్‌ దేశానికి చెందిన ప్రఖ్యాత బాల సాహిత్య రచయిత హాన్స్‌ క్రిస్టియన్‌ ఆండర్‌సన్‌ 2 ఏప్రిల్ 1805 న జన్మించాడు. ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 2 ను అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవంగా ఇంటర్నేషనల్‌ బోర్డ్‌ ఆన్‌ బుక్స్‌ ఫర్‌ యంగ్‌ పీపుల్‌ (IBBY) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది.1967 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2 వ తేదీన అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపు కుంటున్నారు.

పిల్లల్లో పఠనాసక్తిని కలిగించడం, పెంపొందించడం, పిల్లలతో బాటు పెద్దల్ని కూడా బాల సాహిత్యం వైపు ఆకర్షించడం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.

చినిగిన చొక్కా అయినా తొడుక్కో…కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది’ అని కందుకూరి ‍వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు నేటికి పుస్తక ప్రియుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి.
కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు కొదవేలేదు. సినిమాలు, టెలివిజన్‌, ఇంటర్నెట్, మొబైల్ ఇతరములు ఎన్ని దరిజేరుతున్నా, పుస్తకం విలువ మాత్రం చెక్కుచెదర లేదు.

మానవ మేధస్సును, విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహద పడుతున్నాయి. ఒక్కసారి విజ్ఞాన సముపార్జన తృష్ణ మొదలైంది అంటే, తుదివరకు అది మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. నిత్య నూతన విజ్ఞానాన్ని అందించేది పుస్తకం.

అక్షరరూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అని ఆర్యోక్తి. అక్షరం ఒక శక్తివంతమైన ఆయుధం. మానవుని భావనా తరంగాలు ఇతరులు స్పష్టంగా చదువ గలిగే ఒక కెమెరా దృశ్యాలు. మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలోకి తెస్తే, తన తరువాతి కాలంలోనూ చదువగలిగే సాధనం అక్షరం. మనిషి అయు ప్రమాణం వందేళ్ళయితే, గ్రంథ ఆయుప్రమాణం అనంతం. ఆ కారణంగానే హిందూ ధర్మంలో గ్రంథాన్ని సరస్వతి రూపంగా భావిస్తూ, గ్రంథ పూజను పుస్తకాల (సర స్వతి) పండుగ పేరుతో శరన్నవరాత్రులలో నిర్వహించే ఆచారం కొనసాగు తున్నది. గ్రంథం పొరపాటున కాలికి తగిలితే, కళ్ళకు అద్దుకునే సత్సంప్రదాయం భారతావనిలో ఉంది.

గ్రంథానికి వయసు అనేది లేదు. అపౌరుషేయాలని భావించే వేదాలు మొదలుకుని, 2300 ఏళ్ళ క్రితం కౌటి ల్యుడు అర్థశాస్త్రం, అనంతరం పాణిని ‘అష్టాధ్యాయి పతంజలి ‘యోగశాస్త్రం’, భరతముని ‘నాట్యశాస్త్రం హాలుని ‘గాథా సప్తశతి’ ఇలా ప్రాచీన గ్రంథాలెన్నో ప్రపంచ సాహిత్యాకాశాన ధ్వజాలలాగ రెపరెపలాడే కీర్తి సంకేతాలుగా నిలుస్తున్నాయి. భారతీయ సాహిత్య సంబంధిత అనేకానేక అపురూప గ్రంథాలు విదేశీయులను ఆకర్షించాయి. అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావా లనే తలంపులో భాగంగా, భారత దేశాన్ని జయించడా నికి వచ్చిన సందర్భంగా ఆయన గురువైన అరిస్టాటిల్ మన దేశ తత్వ సాహిత్యన్ని తెరిగి వచ్చేపుడు తెమ్మన్నాడు. బుద్ధ బోధన గ్రంథాలు, విదేశీ యాత్రికల సందర్శనలకు హేతువులైనాయి. చైనా, టిబెట్, అప్ఘనిస్థాన్, మంగోలియా దేశీయులు భారత సందర్శనతో పాటు, ఇక్కడి బౌద్ధ సాహిత్య మూల, అనువాద రూపాలలో తీసుకెళ్ళారు. అక్షరం కనుగొన బడడానికి ముందు వేద వాజ్మయం శ్రుత సాహిత్యంగా ఉండేది. శృతం లిఖితం కావడం మానవ సంస్కతీ వికాస పరిణామాల క్రమంలో ముఖ్య ఘట్టం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రస్తాన త్రయం, భారత భాగవత రామాయణాలు ఉప పురాణాలు, స్మృతి గ్రంథాలు, భారతీయ కథా సాహిత్యం గ్రంథ రూపం సంతరించు కున్నాక, ప్రపం చంలో ఏజాతీ, ఏదేశం, భారత దేశానికి సాటి రావని సర్వ ప్రపంచానికి ద్యోతకమైంది. భారతీయ సంస్కృతిని చాటిచెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం.
ప్రాచీన తాళపత్ర గ్రంథాలు నలంద, తక్షశిల తది తర విశ్వ విద్యాలయాలలో భద్రపరచ బడి, కొన్ని విదేశీ, విమతాల దాడులలో నశించాయి. మానవుని ఈర్ష్య, అసూయ, కుత్సిత బుద్ధి కారణాలుగా మానవ మేధ చాలాసార్లు మాడి మసి బొగ్గయింది. నేపాల్ విశ్వ విద్యాలయ గ్రంథాలయ భవనం ముందు యాభై వేల సంస్కృత అపురూప గ్రంథాలు తీవ్రవాదుల దాష్టీకానికి బలైన సంఘటన ఈ శతాబ్దపు విశాద ఘటన. ముద్రణా యంత్రాలు వచ్చాక, ప్రతుల ప్రచురణ సులభమైంది. ఒకేసారి ఒక గ్రంథ వందలాది ప్రతులు సిద్ధ మయ్యే సౌలభ్యం ఏర్పడింది. అంతకు ముందు రాజాస్థానాలలో ప్రతులు తయారు చేసే ఉద్యోగులు ఉండే వారు. అయితే మానవ నిర్మిత గ్రంథ తయారీ పని బహు కష్టంతో కూడుకునేది. గ్రంథస్థ విషయాలు ప్రపంచ మంత విస్తృతం, ప్రపంచ వ్యాపితం అవుతున్నాయి. అనేకానేక శాస్త్ర గ్రంథాలు, సృజనాత్మక సాహితీ గ్రంథాలు, ఆధ్యాత్మికాంశాలు, చరిత్ర, వివిధ విద్యలు, రూపాలు, మానసికోల్లాస ప్రధానాలు, ఒకటే మిటి…వేలాది అంశాలు, లక్షలాది గ్రంథాలు, కోట్లాది పాఠకులు నిత్యం దర్శనాలుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తి, ప్రత్యేక గ్రంథంలోకి వెళితే, అది బాహ్య ప్రపంచాన్ని మరిపించే, ఒక ప్రత్యేక ప్రపంచం అవుతున్నది. అందుకే మనిషికి అక్షరమన్నా, గ్రంథమన్నా అంత ప్రేమ, మమకారాలు. ఈ విషయాలను అర్థం చేసుకుని, పుస్తక దినోత్సవం సందర్భంగా పిల్లలలో పఠనాసక్తిని పెంపొందించే కృషి జరగాలి. అలాగే అపూర్వ, అపురూప, అమూల్య ప్రాచీన గ్రంథాల పరిరక్షణ పట్ల బాల్యం నుండే పిల్లలలో అవగాహన కల్పించాలి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments