హైకోర్టు తీర్పును అమలుచేయండి..

Date:


– సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన జలగం వెంకట్రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ను కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో వెంకట్రావు సీఈవోను కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పు ప్రతులను సీఈవోకు అందజేశారు. కేసు వివరాలను వెల్లడించారు. హైకోర్టు జడ్జిమెంట్‌ ప్రకారం తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్‌ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు శాసనసభలోని స్పీకర్‌ కార్యాలయానికి వచ్చిన జలగం..హైకోర్టు తీర్పు ప్రతులను స్పీకర్‌ కార్యలయంలో అందజేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...