* నిరు పేదలకు సాయం.. సీఏం సహాయ నిధి..*
* నియోజకవర్గ పరిధిలోని 70 మంది లబ్ధిదారులకు సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత*
*చెక్కులను వెంటనే తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచన*
* రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు గారు*
*సిద్ధిపేట 28 మార్చి 2021:*
ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 70 మంది లబ్ధిదారులకు రూ.22 లక్షల 50 వేల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు సాయం.. పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.
నిరు పేదలకు సాయం.. సీఏం సహాయ నిధి..
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి