ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Date:


– 31న మంత్రి వర్గ సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఆగస్టు 3 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల 31న (సోమవారం) మధ్యాహ్నం 2గంటల నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర మంత్రి వర్గం చర్చించనున్నది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై మంత్రి వర్గం సమీక్షించనున్నది. రాష్ట్రంలో వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై మంత్రి వర్గం చర్చించనున్నది. రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్‌ చర్చించనున్నది. అదే సందర్భంలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్‌ తగు నిర్ణయం తీసుకోనున్నది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3 ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...

సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి –

– ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్యే భాస్కరరావు– అత్యాధునిక పరికరాల...

మొన్నటి వరకూ కేంద్రాన్ని దునుమాడి.. ఇప్పుడు నోరెత్తని సీఎం

– కార్మికపక్షంపై నిరంకుశత్వం– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్యనవతెలంగాణ...

మతతత్వంతో దేశ విభజన! –

– మతానికి రాజకీయాన్ని జోడిస్తున్న బీజేపీ– మణిపూర్‌ మారణహోమంతో దేశ...