ఈ సినిమా నిర్మాణాన్ని సుష్మిత మాత్రమే చేయాలనుకున్నారు. కానీ టాలీవుడ్కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సైతం ఇప్పుడు ప్రొడక్షన్లో భాగం అవటానికి రెడీ అయ్యింది. ఆ నిర్మాణ సంస్థ ఏదో కాదు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని అంటున్నారు మరి. ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే అనౌన్స్మెంట్ వరకు ఆగాల్సిందే. సినిమా నిర్మాణానికి వ్యయమంత తామే పెడతామని, లాభాల్లో 50-50 వాటాను తీసుకుందామని డీల్ పెట్టారట. రిస్క్ లేని డీల్ కావటంతో చిరంజీవి సైతం ఈ డీల్కు ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.