జాతీయస్థాయిలో విపక్షాల కూటమి మరోపక్క ఎన్డీఏ కూటమి.పోటపోటీగా సమావేశాలు నిర్వహించడం తెలిసిందే.
నేడు ఢిల్లీలో( Delhi ) బీజేపీ మిత్రపక్షాలు.సమావేశమయ్యాయి.
మూడోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఈ ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.ఇదిలా ఉంటే విపక్షాల కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని కోరారు.బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తామంతా ఇండియా కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు.
ఎన్డీఏ.బీజేపీ నేతలు( BJP leaders )… మీరు ఇండియాను సవాలు చేయగలరా అని ప్రశ్నించారు.విపక్షాలు, రైతులు, విద్యార్థులు, దళితులు ఈ దేశం కోసం కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు.
ఇండియా కూటమి తప్పకుండా గెలుస్తుంది.ఇండియా గెలిస్తే ఈ దేశం గెలిచినట్లే అని స్పష్టం చేశారు.
ఈ దేశం గెలిస్తే బీజేపీ ఓడినట్లే అంటూ మమతా బెనర్జీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.దాదాపు మూడు రోజుల నుండి జరుగుతున్న ఈ సమావేశంలో.
వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీని గద్దె దించడానికి విపక్షాల నేతలు అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.