కొరియోగ్రాఫర్ యశ్ని హీరోగా, శశికుమార్ అనే డైరెక్టర్ని పరిచయం చేస్తున్నారు దిల్ రాజు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్కు తెరపడింది. కార్తీక మురళీధరన్ అనే మలయాళ హీరోయిన్ను టాలీవుడ్కి పరిచయం చేస్తున్నారు దిల్ రాజు. ఆమె బ్యాగ్రౌండ్ గురించి తెలిసిన సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి.కె.మురళీధరన్ కుమార్తె. ఈయన బాలీవుడ్లో త్రీ ఇడియట్స్, పీకే, పానిపట్, మొహంజదారో వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేశారు. ఆయన కుమార్తె ఈ కార్తీక మురళీధరన్.